గుడివాడ టౌన్, మార్చి తమ వార్డుల్లో తాగునీటి సమస్య తీర్చాలంటూ మహిళలు నగరదర్శిని లో అధికారులను నిలదీశారు. నగర దర్శినిలో భాగంగా శుక్రవారం 1,36 వార్డుల్లో కమిషనర్ పర్యటించారు. తమకు తాగునీరు సరఫరా జరగడం లేదని, వచ్చినా దుర్వాసనతో వస్తోం దని మున్సిపల్ కమిషనర్ బి నాగభూషణానికి 36వ వార్డులోని మహిళలు చెప్పారు. వేసవిలో కూడా మంచినీరు అందించకపోతే మేము ఎక్కడి కెళ్ళి తేవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటిని సమృద్ధిగా అందిస్తామని, పైపులైన్ల లీకేజిల వల్ల మురుగు వస్తోందని కమిషనర్ మహి ళలకు చెప్పారు.
వెంటనే మరమ్మత్తులు చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం 1వ వార్డులోని బీసీ, ఎస్సీ వసతి గృహాలను తనిఖీ చేశారు. హాస్టల్లో సౌకర్యాల గురించి విద్యా ర్థులను అడిగి తెలుసుకున్నారు. నగరదర్శిని స్పెషల్ ఆఫీసర్ వి సుధాకర్ మాట్లాడుతూ రెండవ విడత నగరదర్శిని సందర్భంగా ముమ్మ రంగా తనిఖీలు నిర్వహి స్తామని చెప్పారు. ప్రభుత్వ సిబ్బంది తమ విధులు నిర్వహణలో ఇంకా బాధ్యతాయుతంగా మెలగాలని చెప్పారు. ఎంఈవో వెంకటేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్ ఎం మురళీకృష్ణ, పీవో ఎ శేఖన్న, ఇన్ఛార్జ్ ఎంహెచ్వో సోమశేఖర్, వార్డు కౌన్సిలర్ అసిలేటి అర్జున తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు గుడివాడ టౌన్ : వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుని పట్టణ ప్రజలకు పుష్కలంగా తాగునీరు అందిస్తామని మున్సిపల్ చైర్మన్ లంకదాసరి ప్రసాదరావు చెప్పారు. స్థానిక పెదఎరుకపాడులోని పాత, కొత్త సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు లను, హెడ్ వాటర్ వర్క్స్ను కమిషనర్ నాగభూషణంతో కలిసి ఆయన పరిశీలించారు. చైర్మన్ మా ట్లాడుతూ గత ఏడాది పట్టణ ప్రజలకు రోజు విడిచి రోజు మంచి నీరు సరఫరా చేశామన్నారు. ఈ ఏడాది చెరువుల్లో పుష్కలంగా నీరు ఉందని, మంచినీటి కోసం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవ సరం లేదన్నారు. ప్రతిరోజు నీరు అందిం చడానికి చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. 108 ఎకరాల నూతన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను కూడా త్వరలో ప్రారంభిస్తామని ఆ యన చెప్పారు.
ఈ నేపథ్యంలో 40 ఏళ్ళు వరకు పట్టణ ప్రజలకు నీటి కష్టాలు ఉండవని ఆయన అన్నారు. మున్సిపల్ ఇం జనీర్ వెంకటే శ్వరరావు మాట్లాడుతూ పాత ఫిల్టర్ లకు మరమ్మతులు చేయిస్తున్నామని చెప్పారు. తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడనవసరం లేదని ఆయన అన్నారు. కమిషనర్ బి నాగభూషణం, ఏఈ సుధాకర్, వాటర్ వర్క్స్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more